మాజీ ఎంపీ కవిత పుట్టినరోజు
కేక్ కట్ చేసిన బి ఆర్ఎస్ మండల నాయకులు
తొలి సమయం దంతాలపల్లి జనవరి 1
దంతాలపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసినారు. ఈ కార్యక్రమంలో దంతాలపల్లి మండల పార్టీ బారాస అధ్యక్షుడు ధర్మారపు వేణు మాట్లాడుతూ రానున్న సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లలో బారాస పార్టీ గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు కావున పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బారాస యువజన మండల అధ్యక్షుడు వీరబోయిన కిషోర్, మండల నాయకులు నాగిరెడ్డి వెంకటరెడ్డి, గొడిశాల సంజీవరావు, మంగి రామ్మూర్తి, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు రొయ్యల సురేష్, బాధ నరసయ్య, నాగేష్, భరత్ కుమార్, కృష్ణ, సురేష్, ఏకన్న, మధు తదితరులు పాల్గొన్నారు.