చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరం
– హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
తొలిసమయం హన్మకొండ /మాతృత్వం ఒక వరమని అందుకు పిల్లలు లేని దంపతులకు చట్టబద్ధమైన దత్తత ఉత్తమ మార్గం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శుక్రవారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ ప్రత్యేక దత్తత విభాగం కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నియమ నిబంధనలకు ఎంపికైన నాలుగు నెలల శిశువు, పదహారు సంవత్సరాల బాలుడి దత్తతను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన దంపతులు, రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన దంపతులకు దత్తత కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా దత్తత తీసుకోవాలని అన్నారు. అక్రమ దత్తత తీసుకోవడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడొద్దని పేర్కొన్నారు. పిల్లలను దత్తత తీసుకున్న దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ అవంతి, సోషల్ వర్కర్ సంగి చైతన్య, ఎక్స్టె న్షన్ ఆఫీసర్ ఆశ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.