పురుషోత్తమాయా గూడెం శివారులో 80కేజీల ఎండు గంజాయి పట్టిత
తొర్రూర్ డిఎస్పీ కృష్ణ కిషోర్
తొలి సమయం మహబూబాబాద్ డిసెంబర్ 9:
మానుకోట జిల్లా మరిపెడ సీ రోలు మండలం పురుషోత్త మాయ గూడెం శివారులో నిషేధిత 80 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తొర్రూర్ డి ఎస్పీ కృష్ణ కిషోర్ తెలిపారు అయన వివరాల ప్రకారం
సుమారు రూ.20లక్షలు విలువచేసే 80కిలోల ఎండు గంజాయి, రవాణాకు వినియోగిస్తున్న టాటా మ్యాజిక్ ఆటోను అదుపులోకి తీసుకున్నారు
ఆంద్రప్రదేశ్ లోని అల్లూరిసీతరామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం కు చెందిన కోర్ర నర్సింగ్, వంతల మోహన్ బాబు, వంతల సాదు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..వాహనం సీజ్ చేసిన పోలీస్లు తెలిపారు
*ఆంద్రప్రదేశ్ లోని సీలేరు లో కొనుగోలు చేసి తెలంగాణా రాజధాని హైదరాబాద్ కు తరలించే క్రమంలో పురుషోత్తమాయగూడెం శివారులో అదుపులోకి తీసుకున్నారు.