సుప్రీం కోర్ట్ తీర్పును లెక్కచేయని రేవంత్ సర్కార్
— ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
తొలి సమయం మహబూబాబాద్ నవంబర్ 8: సుప్రీంకోర్టు వర్గీకరణకు తీర్పు ఇచ్చింది కాని అమలు చేయకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదు అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మాలల ఆధిపత్యం నడుస్తోందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి వర్గీకరణ చేయాలని ఉన్న కొంత మంది అడ్డుపడుతున్నారని విమర్శించారు, ఎస్సీ వర్గీకరణను అమలుపరచుకునేందుకు మరొకసారి మాదిగలు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు