కలెక్టరేట్ వార్ రూమ్ సెక్యూరిటీ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య..
తొలి సమయం మహబూబాబాద్ అక్టోబర్ 13:
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో వార్ రూము వద్ద విధులు నిర్వహిస్తున్న జి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాధ్ కేకన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.. వివరాల్లోకి వెళితే మృతి చెందిన కానిస్టేబుల్ పేరు గుడి బోయిన శ్రీనివాస్, 1990 కి చెందిన బ్యాచ్, ఏ ఆర్ హెచ్ సి 1785, జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో నివసిస్తున్నారు, ఇతనికి ఒక కొడుకు సుశాంత్ మరియు భార్య విజయలక్ష్మి ఉన్నారు, భార్యాభర్తల మధ్య వివాదాలే కారణంగా తెలుస్తోంది, వివరాలు తెలియవలసి ఉంది.