—ఇద్దరు సైనికులకు గాయాలు
తొలి సమయం, మహబూబాబాద్ ఆగస్టు 6:బారీవర్షంలో వాగులు వంకల్లో వరదలు పూసి పారుతున్నాయి. కొత్త చిగురెసిన చిక్కటి అడవమ్మ వడిలో తుపాకి మోతలు దద్దరిల్లాయి,మావోయిస్తుల రక్తంతో అడివి ఆకులన్ని అలుకేసు కున్నాయి,శనివారం కరక గూడెం మండలం రఘు నాదపాలెం గుట్టలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టు లకు మధ్య ఎదురు కాల్పులు జరిగి 6గురు మావోయిస్తులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు గాయపడినట్లు సమాచారంగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆటోమెటిక్ ఆయుధాలతో సహా నాక్సల్స్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.మృతుల్లో పాల్వంచ మణుగూరు దళ కామాండర్ కుంజ వీరయ్య ఉన్నట్లు నిర్ణయానికి వొచ్చినట్లు సమాచారం, మృతుల్లో తులసి, శక్రు, చలో, దుర్గేష్, కట్, లు ఉన్నారు మృతుల్లో మహిళా నక్సల్స్ ఉండడం గమనార్హం