సీనియర్ కెవిపిఎస్ (కుల వివక్షత పోరాట సమితి) నాయకులు కుర్ర మహేష్ మృతి..
తొలి సమయం మహబూబాబాద్ మార్చ్ 18: సీనియర్ కెవిపిఎస్ నాయకులు కుర్రమహేష్ (52 )మృతి చెందారు అతనికి కొడుకు కూతురు ఉన్నారు.విద్యార్థి దశనుండి సుమారు 30సంవత్స రాలుగా సిపిఎం పార్టీ అనుబంద విద్యార్థి సంఘము ఎస్ఎఫ్ఐ, మరియు డివైఎఫ్ఐ, కెవిపిఎస్ లో పనిచేసారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుగా సిపిఎం మహబూబాబాద్ మండల కమిటీ సభ్యులుగా, డివైఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసారు.. ఇటీవల మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన ఎన్నికలలో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా, అదే వార్డులో మృతులు మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేసాడని,సిపిఎం అభ్యర్థిని ఓడించాలనే దురుఉద్దేశ్యం తో ప్రత్యర్థికి సహకకరించడని, ఆ కారణంతో, మృతులు మహేష్ ను సిపిఎం పార్టీ బహి
ష్కరణ వేటు వేశారని, పలు వార్త పత్రికల్లో రావడం గమనార్హం,అయితే వేదనతోనే మనస్థాపానికి గురై ప్రాణం మీదికి తెచ్చుకున్నట్లు కూడా సర్వత్రా టాక్ నడుస్తోంది..