మేడారం లో సర్కార్ కు ఆదివాసీ సంఘాల స్ట్రోక్
దిగి వచ్చిన సర్కార్
పూర్వ కోయమూలల చెరపకుండా యదాస్థితి
అది వాసి సంఘాలు ప్రతినిధుల పూజరులు ములుగు కలెక్టర్ మంత్రి సీతక్క బేటీ
త్వరలో డిసైన్ కరారు
తొలి సమయం కధనం తో దిగిఒచ్చిన సర్కారు
తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ సెప్టెంబర్ 11:
మేడారం సమ్మక్క సారక్క మహా జాతర కోసం ఆధునీకీకరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కు ఆదివాసి సంఘాలు రాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సర్కారు బెట్టు దిగింది, వచ్చే ఏడాది జనవరి 28 నుంచి అయ్యే మేడారం జాతర నేపథ్యంలో ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై, ఆదివాసి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి గద్దెల కైవారం ప్రాంగణంలో సర్కారు తలపెట్టిన మార్పుల ఫైర్ అవుతున్నారు, జూలై మూడున మేడారం ప్రాంగణంలో దేవాదాయ శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశం నుండి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతుండడం గమనార్హం, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలు, వాటి కైవారం విషయంలో సర్కారు అనాలోచితంగా ఏకపక్షంగా నిర్ణయాలు సరికాదు అంటూ మొదటి నుంచి ఆదివాసులు అగ్గి రాజేస్తున్నారు. ఆదివాసి మూలాలకు, సంప్రదాయాలకు ఏమాత్రం ఏమాత్రం విఘతం కలిగించిన పరిణామం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక చేస్తున్న మాట అందరికి విదితమే..
ఆదివాసీ సంఘాలు పూజారులతో మంత్రి సీతక్క బేటీ..
గద్దెల మార్పుకు సంబంధించి ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపాధ్యాన్ని సమాలోచన చేస్తూ ఆ వర్గాలతో, మంత్రి సీతక్క మరియు ములుగు కలెక్టర్ బేటీ అయ్యారు.. దేవాదాయ శాఖ వారు ఇచ్చినా గద్దెల నమోనా కాకుండా పూర్తిగా కోయ సంస్కృతి సంప్రదాయాలతో. ఆదివాసీల అభిప్రాయాల మేరకు గద్దెల నిర్మాణంలో ఆదివాసి మూలాలు ఉంటాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్టు సమాచారం..త్వరలో గద్దెల డిసైన్ విడుదల చేయనున్నట్లు సమాచారం