ఆధ్యాత్మిక విశ్వగురువు శ్రీ విశ్వ స్ఫూర్తి జన్మదిన సందర్బంగా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం…
తొలి సమయం, మహబూబాబాద్ ఏప్రిల్ 29:
ఆధ్యాత్మిక గురువు శ్రీ విశ్వ స్ఫూర్తి జన్మదిన సందర్భంగా స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. మానవతో రక్షతి రక్షితః అనే గురు విశ్వ స్ఫూర్తి నినాదంతో.. మానవతా విలువల పరిమళాలు సమాజం లో వెదల్లడమే లక్ష్యంగా స్ఫూర్తి ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేపడుతుందని నిర్వాహకులు తెలియజేశారు, గా పుట్టినందుకు మానవత్వంతో బ్రతకాలని మానవతా సమాజం ఏర్పడాలనేదే గురు విశ్వస్పూర్తి ద్యేయం అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డి ఎస్పీ తిరుమల రావు మరియు టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మండు టెండలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయ వంతం అయ్యింది