బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పైసల్లేవ్: మాజీ మంత్రి ఎర్ర బెల్లి

బిఆర్ఎస్ రజతోత్సవ సభకు పైసల్లేవ్: మాజీ మంత్రి ఎర్ర బెల్లి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

— తగ్గిన పాజిటివిటీ

— డబ్బుల్లేవ్, జనమే స్వచ్చందగా రావాలి

–నేను చెప్పినట్లు 30మంది సెట్టింగ్ లను మారిస్తే వొడిపోయే వాళ్ళం కాదు

సామాన్య ఎన్నారై చేతిలో ఓటమి తోనే నైరాష్యంలో మాట్లాడిన మాటలు అంటున్న జనం..

తొలి సమయం, డెస్క్ హైదరాబాద్ ఏప్రిల్ 18: ఈనెల 27వ తారీకు వరంగల్లో జరగబోయే టిఆర్ఎస్ రజతోత్సవ సభ పై ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే ల్లో ఉత్సాహం సన్నగిల్లిందా! జనం నాడీని ముందే తెలుసుకొని వాళ్ల పై వాళ్ళకే నమ్మకాన్ని కోల్పోయారా! టిఆర్ఎస్ రజితోత్సవ సభ ఫెయిల్యూర్ అవుతుంది అనే అంచనాలు ముందే ఉన్నాయా! అందుకే పైకి బలంగా పనిచేస్తున్నట్లు ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు జన సమీకరణ కోసం మొక్కు బడిగా చేస్తున్నారా అంటే ఎర్ర బెల్లి మాట్లాడిన మాటల ఆధారంగా నిజమే అని సమాధానాలు వస్తున్నాయి. ఈనెల 27 వరంగల్ ఎల్కతుర్తి లో బిఆర్ఎస్ రజతోత్సవ సభకోసం పాలకుర్తి నియోజకవర్గం లో సన్నాక సభలో మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడిన మాటలు సర్వత్ర వైరల్ అవుతున్నాయి ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి. జనాలు ఏ స్థాయి లో వస్తారో తెలువని పరిస్థితి అన్నారు, గతంలో సభలు సమావేశాలకు జనాన్ని సమీకరించడానికి మనిషికి 300 ఇచ్చేదని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఆ పరిస్థితి లేదని అన్నారు.
పది సంవత్సరాలు ఆర్థికంగా రాజకీయాంగా, అన్ని అంగుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే లు మంత్రులు సెకండ్ శ్రేణి నాయకులు వెలుగు వెలిగారు ఓ సందర్బంగా 30 సంవత్సరాలు మాదే అధికారం అంటూ టిఆర్ఎస్ బీరాలు పలికింది అధికారం పోయిన సంవత్సరం నర లోనే, ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడవలసిన విఆర్ఎస్ పార్టీ మొదటి సా రిగా జరుపతలపెట్టిన రజతోత్సవ సభకు డబ్బుల్లేవు, ఎంతమంది వస్తారో అనేది గ్రామాల్లో స్వచ్చందంగా నిర్ణయించుకుని రావాలని అనడం లోని అంతర్యమేమిటని జనాల్లో టాక్ నడుస్తోంది.

రజితోత్సవ సభ చారిత్రాత్మకంగా నిలిచిపోవాలని లక్షలాది మంది జనాన్ని తరలించాలని ఒకపక్క కేసీఆర్ పిలుపు నిస్తున్నారు, కానీ ఎర్రబెల్లి ఎర్రబెల్లిలో నిరాశ వాదా దృక్పథం ఆయన మాటలద్వారా తేటతెల్ల మౌతుందనే అనుమానాలకు తావిస్తోంది. మాములు ఎన్నారై పై వోడి పోయాను అనే నైరాష్యం కూడా ఎర్రబెల్లి ని ఎవరించే భలహీనంగా మాట్లాడుతున్నారు అనే టాక్ నడుస్తోంది పైగా నేను చెబితే వినలేదు 30 మంది సెట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే టిఆర్ఎస్ ఓడిపోయేది కాదు అని మాట్లాడారు. అయితే ఓటమి విజయాలకు నాంది అని కెసిఆర్ సరిపెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణా లో బి ఆర్ ఎస్ మనుగడ ఏ స్థాయిదో అని నిర్ధారణ కావాలంటే రజితోత్సవ సభ సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది.. వేచి చూద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *