మొత్తం ఈ రాష్ట్రంలో భూముల “నాశనానికి బోనీ కొట్టెందే బిఆర్ఎస్”

మొత్తం ఈ రాష్ట్రంలో భూముల “నాశనానికి బోనీ కొట్టెందే బిఆర్ఎస్”

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

యూనివర్సిటీ ల భూముల పై కన్నేసిందే టిఆర్ఎస్…

10 సంవత్సరాలు అధికారంలో ఉండి భూముల పందేరాన్ని నడిపించింది టిఆర్ఎస్ పార్టీ..

— ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మర్చిందే గత పదేళ్ల పరిపాలన

ఎంపీ రఘునందన్ రావు

“రాష్ట్రంలో మొట్టమొదటిగా భూముల నాశనానికి పాల్పడ్డదే గత పదే ఏళ్ల బీఆర్ఎస్ పాలన అని, అధికారంలో ఉండి భూముల పందేరాన్ని నడిపించి, ముఖ్య మంత్రి కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిందే టిఆర్ఎస్ పరిపాలన అంటూ ఎమ్మెల్యే రఘనందన్ రావు నిప్పులు చెరిగారు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. 2022లో ధర్మేంద్ర ప్రాధాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి హెచ్ సి యు భూములను రక్షించాలని ఉత్తరం రాశారు అన్నారు. కాని 2023 డిసెంబర్ గద్దె దిగి పోయే వరకు బావ బహ్మర్థులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు అసలు తెలంగాణలో భూముల దోపిడీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు”

తొలి సమయం ప్రధాన ప్రతినిధి మహబూబాబాద్ మార్చి 11:

సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ దగ్గరకు బీజేపీ నాయకులుగా వెళ్ళాం అని గుర్తుకు చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 18 ఎకరాల భూమిని టీఎన్జీవో కాలనీకి ఇచ్చారు, ఆనాటి రంగారెడ్డి కలెక్టర్ 2012 రాసిన ఉత్తరాన్ని బావ బహ్మర్థులు అధికారం పోయే వరకు పట్టించు కోలేదు అన్నారు.
గజ్వేల్, ములుగులోని హార్టీ కల్చర్ యూనివర్సిటీ భూములను కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ భూములు అని రెవిన్యూ పహాని రికార్డు లో ఎక్కించారు అవి 1974 లోనే కేంద్రం ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ గెజిట్ భూములు అని రాసి పెట్టింది అని గుర్తు చేశారు. ఆ భూములు రెవిన్యూ రికార్డు లో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ అని రాపించడం లో ఉన్న మతలబు భూములను అమ్ముకోవడమే కదా! అన్నారు.
అధికారం లో ఉన్నప్పుడు ఒక మాట ఇంకొక మాట ఈ విధంగా ద్వంద పాటించేటోళ్ళకు ప్రతిపక్షంగా నిలబడే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారు..కాంగ్రెస్ ది టిఆర్ఎస్ ది ప్రభుత్వ భూములు అమ్మడమే కదా అన్నారు

2022 ధర్మేంద్ర ప్రధాన్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలు 2వేల ఒక వంద 8ఏకురాలు అని రాసిన ఉత్తరాన్ని చూపించారు ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీ వే అని రాసి ఉన్నదికనుక ఆ భూములను రక్షించడానికి మేము చేసే ప్రయత్నమే నిజం, మేమెప్పుడూ విద్యార్థులు వైపే ఉన్నాయి, ఉంటామని కారాకండి గా అన్నారు ఈ ప్రెస్ మీట్ లో ఎంపీ ఈటల రాజేందర్ ఇతర బిజెపి నాయకులు ఉన్నరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *