“తల్లి దండ్రులారా బెట్టింగ్ మహమ్మారీ” నుండి పిల్లలను కాపాడండి
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్స్ ను మానుకోండి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
తొలి సమయం మహబూబాబాద్ మార్చి 23 :
బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి, బెట్టింగుల పిల్లలనుండి పిల్లలను కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేక పిలుపు నిచ్చారు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అనేక విషయాలను సూచనలు చేశారు
కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి.అన్నారు
ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక ఫక్తు వ్యాపారం అని విమర్శలు చేసారు
చిన్న చిన్న చేపలను అమాంతం మింగేస్తాయి జాగ్రత్త అని హెచ్చరిక చేశారు
పెద్దలకు సూచనలు చేశారు ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోండిఅన్నారు
లేదంటే డబ్బులు, ప్రాణాలు రెండు పోయే అవకాశం ఉంది.
మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండి.
ఐపీల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఐపీల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ఎవరైనా ఐపీఏల్ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్ కు పాల్పడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వగలరు.