పట్టపగలే నడిరోడ్డుపై ఎస్సై హత్య
తొలి సమయం, హైదరాబాద్ మర్చి 21:
న్నైలో కొందరు దుండగులు పట్టపగలు నడిరోడ్డుపై ఓ..ఎస్ఐ ని దారుణంగా హత్య చేశారు. వేటకొడవళ్లతో తలపై పలుమార్లు నరికి కిరాతకంగా చంపారు.
ఆ…హత్యకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతోఅది చూసిన వారు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. పోలీస్ అధికారికే రక్షణ లేకుండా పోతే… మరి సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
ఈ.. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి… జాకీర్ హుస్సేన్ (57) గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేశాడు. రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అదే సమయంలో కొందరు వ్యక్తులు బైక్ పై వచ్చి జాకీర్ హుస్సేన్ కారును అడ్డుకున్నారు. తేరుకునేంతలోనే వేటకొడవళ్లతో జాకిర్ హుస్సేన్ పై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వారి నుంచి తప్పించుకుని, ప్రాణాలు కాపాడుకునేందుకు జాకీర్ హుస్సేన్ ఎంత ప్రయత్నించినా ప్రాణాలు నిలవలేదు. అతడు కారులో ఉండగానే కత్తులతో దాడి చేసి పరారయ్యారు.
*స్థలం వివాదమే హత్యకు కారణం…*
నడి రోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ హత్య ఒక స్థలం వివాదం కారణంగా జరిగినట్లు తెలుస్తోంది. *తొట్టిపాళం మెయిన్ రోడ్డులో 36 సెంట్ల భూమికి సంబంధించి* జాకీర్ హుస్సేన్ కు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ఇది వరకే పాత గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే విషయంలో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకున్నారని సమాచారం. ఆ.. క్రమంలోనే జాకీర్ హుస్సేన్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య చేసిన తర్వాత నిందితులలో *అక్బర్ బాషా, తవఫీక్* అనే ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం…