చిరుమళ్ళలో పరిపూర్తి అయిన గుడిమెలుగు
పగిడిద్ద రాజు సారలమ్మలు గద్దెకు వస్తున్న సన్నివేశంతో రెండవ రోజు జాతర మొదలు అవుతుంది
తలపతులు చందావీరయ్య,వడ్డెలుగా సిద్దబోయిన వెంకటేశ్వర్లు మోహన్ రావులు పాల్గొన్నారు
తొలి సమయం డెస్క్ ఫిబ్రవరి 12:
చిరుమళ్ల సమ్మక్క జాతర మొదటి రోజు ఘట్టం సమ్మక్క పానుపు ను గద్దెల పైకి తీసుకురావడం,తల్లి ఆభరణాలు గద్దెల వద్దకు తీసుకురావడం ఆసక్తిని కనపర్చింది, ఆర్తి డోలు శబ్దాల మోతలు, ఆదివాసీ ఆభాల గోపాలం పాల్గొని ఈలలు బారి అరుపులు, కేకలతో గద్దెల ప్రాంగణం వల్లు గగురు పొడిచే సన్నివేషం సమ్మక్క గుడి చుట్టూ ఉన్న భక్తులను అప్రమత్తం చేసింది. అత్యంత భక్తి శ్రద్దలను కనపర్చింది తర్వాత, సమ్మక్క పానుపు ఆభరణాలకు ప్రత్యేక పూజలో తలపతిగా చందా వీరయ్య పాల్గొనగా ఆయన పర్యవేక్షణ లో గుడి మెలుగు కట్టు తీశారు, ఈ కార్యక్రమం లో తలపతులు వడ్డెలుపసుపు కుంకుమ పూజలు నిర్వర్తన పూర్తి అయ్యింది.రాత్రి రెండు గంటల సమయం వరకు పూర్తి అయ్యింది, మోహన్ రావు,సిద్దబోయిన వెంకటేశ్వర్లు కల్తీ చంద్రయ్య పాల్గొన్నారు, వీరితో గుడి కట్టు నిర్వహించారు తల పతి చందా వీరయ్య ఆధ్వర్యంలో గుడి మెలుగు పూర్తి అయ్యింది, రెండవ రోజు, బుధవారం 12వ తారీకు పగిడిద్ద రాజు మరియు సారలమ్మ లను మేనమామల ఇంటినుండి రాత్రి చిరుమళ్ల సమ్మక్క గద్దెల వద్దకు తీసుకునిరావడం సన్నివేశం ఉంటుంది