ఎసిబి వల్లలో చిక్కిన పంచాయతీ రాజ్ అవినీతి చేప జి కార్తీక్..
తొలి సమయం మహబూబాబాద్ నవంబర్ 29:
వరంగల్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో డ్రాయింగ్ విభాగంలో పనిచేస్తున్న సహాయ ఇంజనీర్ జీ, కార్తీక్ ఏసిబి పన్నిన 12వలలో చిక్కారు వివరాల్లోకి వెళితే.. ఫిర్యాదు దారుని చేత (ఏం జి ఎన్ ఆర్ ఇజి పధకం) వర్ధన్నపేట మండలంలోని పూర్తి చేయబడిన సిసి రహదారుల నిర్మాణపు పనులను పరిశీలన చేసి తొమ్మిది లక్షలు విలువ అయిన బిల్లులను నిర్ధారణ చేసేందుకు 5000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అనిషా అధికారులకు పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ వారి కార్యాలయంలోని డ్రాయింగ్ విభాగంలో పనిచేసే సహాయక ఇంజనీర్ జి కార్తీక్.. ఎవరైనా లంచం అడిగితే 10 64 డయల్ చేయాలని ఏసీబీ అధికారులు మనవి చేశారు