మావోయిస్టుల్లో (సాయుద సంస్కృతిలో).. మరో 27మంది మాత్రమే అజ్ఞాతంలో….
–ఒక్కరొక్కరు ఒరిగినా..మిగిలిన వారు కూడా అదే దారిలో
—2010 ప్రభుత్వం గుర్తించింది కరీమ్ నగర్ 60మందిని, ఉమ్మడి వరంగల్ నుండి 80మందిని.
20 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో అంటే (మావోయిస్టు పార్టీ) 1991 94 కాలం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న మావోయిస్టులు 30 ఏళ్ల తర్వాత అంతకంటే ఎక్కువ పెను సంక్షేమ సంక్షోభంలో కోరుకపోయారానే తెలుస్తోంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రస్తుతం పోరు బాటలో ఓరుగల్లు నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో దామోదర్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు విశ్వసనీయ సమాచారం.. ఇక కేంద్ర కమిటీ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలకు చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు.. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో గణేష్ మావోయిస్టుల చర్చల ప్రతినిధిగా అప్పట్లో వెళ్లారు. అలాగే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దుల గూడెం గ్రామానికి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కార్యదర్శిగా ఏఓబి కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పిడి బాబురావు అంకిశ్వరం సారయ్యలతో లతోపాటు పలువురు నేతలు కేంద్ర కమిటీలో కీలక బాధితులలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హనుమకొండ జనగామ జిల్లాలో 18 మందికి పైగా అజ్ఞాతంలో ఉండగా భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా నుంచి ఐదుగురు మావోయిస్టులు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 27 మందికిపైగా నక్సల్స్ మావోయిస్టు ఉద్యమంలో అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం… 2021 నుండి 24 మధ్య కాలంలో మావోయిస్టులు ఆత్మ రక్షణలో పడ్డట్టుగా సరేనా జరిగిన పరిణామ సమీకరణల ద్వారా తెలుస్తుంది.. ఆటుపోట్ల మధ్య కూడా. ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైన మావోయిస్టులు..