మాదవాపురం హైస్కూల్ లో ఘనంగా గురుపూజోత్సవం
——నైతికతను పెంచే విద్యమాత్రమే మనో బలాన్ని ఇస్తుంది
స్కూల్ హెచ్ ఏం &పిఆర్ టీయు జిల్లా అధ్యక్షులు సంక బద్రినారాయణ
తొలి సమయం, మహబూబాబాద్ ఆగష్టు5: నైతికతను పెంచే విద్య మాత్రమే మనోబలాన్నిస్తుందని మాధవపురం ఉన్నత పాఠశాల హెచ్ఎం మరియు పి ఆర్ టి యు జిల్లా ప్రెసిడెంట్ సంకబద్రి నారాయణ అన్నారు స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సంక బద్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని, వాటి నివారణకు నైతిక విలువలతో కూడుకున్న విద్యను బోధించడంలో నేటి ఉపాధ్యాయులు కీలక భూమిక వహించాలని అన్నారు, తల్లి దండ్రుల కంటే విద్యార్థులు ఎక్కువ సమయం బడిలో ఉపాధ్యాయుల చెంతనే ఎక్కువగా ఉంటారు కనుక గురువులను తల్లి దండ్రులుతో సమానంగా సమాజం పరిగణిస్తోందని అన్నారు.ఆదర్శవంతమైన మంచి సమాజనిర్మాణం గురువుల తోనే సాధ్యం అవుతుంది అన్నారు ఆ బాధ్యతను గురువులు బుజాల పైకి ఎత్తుకున్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయవృత్తిలో సార్ధకులం అవుతామని అన్నారు. మనం అంకితం భావంతో విద్యార్థులను తేర్చి దిద్దడమే మనం మన గురువులకు ఇచ్చే నిజమైన నివాళ్లు అన్నారు.నేటి విద్యా విధానం సమర్థులు అయినటువంటి ఇంజనీర్లు వైద్యులను తయారుచేస్తుంది, కానీ నీతి నియమాలకు కట్టుబడే మనో బలాన్ని పెంచడం లేదని ఆవేదన పడ్డారు. అందువలననే అవినీతి నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. నేడు సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారంతా కంప్యూటర్ ఇంజనీర్లే.. ఇటీవల కలకత్తాలో జరిగిన హత్యాచారం కేసుల్లో నిందితులు అంతా బాగా చదువుకున్నవారేనని అన్నారు. విద్య నేరాలను తగ్గించి సమాజ శ్రేయస్సును కోరుకునే వ్యక్తుల సంఖ్యను పెంచాలని అన్నారు. కాని అందుకు విరుద్దంగా జరుగుతున్నదని అన్నారు కనుక నైతికతను పెంచే విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయ బృందన్ని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్నేహలత రమాదేవి సుజాత సౌభాగ్య చంద్రశేఖర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు